ఛ‌లో అమెరికా అంటున్న స‌మంత‌.. ఇక ఇప్ప‌ట్లో ఈ బ్యూటీ దొర‌క‌డం క‌ష్ట‌మే!?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఛ‌లో ఆమెరికా అంటోంది. మ‌రికొద్ది రోజుల్లోనే ఆమె అమెరికా పయనం కాబోతోంది. అయితే ఈ అమెరికా టూర్ వెకేష‌న్ కోసం కాదండోయ్‌. కొద్ది నెల‌ల క్రితం స‌మంత మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీని కార‌ణంగా చాలా రోజులు ఇంటికే ప‌రిమిత‌మైన స‌మంత‌.. ట్రీట్మెంట్ చేయించుకుని మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయింది.

బాలీవుడ్ లో వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి `సిటాడెల్‌` వెబ్ సిరీస్‌ మ‌రియు టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా `ఖుషి` సినిమా షూటింగ్స్ లో గ్యాప్ లేకుండా పాల్గొంది. ఈ క్ర‌మంలోనే స‌మంత‌కు మ‌ళ్లీ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో సినిమాల‌కు బ్రేక్ ఇవ్వాల‌ని నిర్మించుకుంది. చ‌క‌చ‌కా సిటాడెల్ తో పాటు ఖుషి మూవీని కంప్లీట్ చేసింది. అలాగే గతంలో సైన్ చేసిన కొన్ని సినిమాలను కూడా ఇప్పుడు చేసే పరిస్థితి లేకపోవడంతో తీసుకున్న అడ్వాన్సులను తిరిగి నిర్మాతలకు ఇచ్చేసింద‌ట‌.

ఇక ఇప్పుడు ఆరోగ్యాన్ని చ‌క్క‌దిద్దుకునేందుకు స‌మంత సిద్ధం అవుతుంద‌ట. ఇందులో భాగంగానే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ల‌బోతోంద‌ని అంటున్నారు. అక్కడ ట్రీట్మెంట్ కు దాదాపు రెండు కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ట‌. అయినాస‌రే డ‌బ్బు విష‌యంలో స‌మంత ఏ మాత్రం రాజీ ప‌డ‌కుండా బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుని హెల్తీగా ఇండియాకు రావాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక స‌మంత అమెరికా వెళ్లిందంటే ఇప్ప‌ట్లో ఆమె దొర‌క‌డం క‌ష్ట‌మే అని కూడా అంటున్నారు.