`బేబీ` మూవీ చూసి ఏడ్చేసిన ర‌ష్మిక.. రాశి ఖ‌న్నాకు మాత్రం అవే గుర్తొచ్చాయ‌ట‌!

బేబీ.. నేడు విడుద‌లైన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఇందులో హీరోగా న‌టిస్తే.. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. విరాజ్ అశ్విన్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషించాడు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బేబీ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే విడుద‌ల‌కు ఒక‌రోజు ముందు అన‌గా జూలై 13న‌ ఈ సినిమా ప్రీమియర్స్ ని వేశారు చిత్ర నిర్మాతలు. `బేబీ` మూవీ ప్రీమియర్స్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా, రాశి ఖ‌న్నాతో పాటు ప‌లువురు సినీ తార‌లు వీక్షించారు. అయితే బేబీ మూవీ చూస్తూ ర‌ష్మిక ఏడ్చేసింద‌ట‌. సినిమా కంప్లీట్ అయ్యాక‌ ర‌ష్మిక చాలా ఎమోష‌న‌ల్ గా థియేట‌ర్ లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమా ఎలా ఉందని మీడియా వారు ప్ర‌శ్నించ‌గా.. ఆమె ఏం మాట్లాడ‌క‌లేక థంబ్స్‌-అప్ సింబ‌ల్ చూపిస్తూ వెళ్లిపోయింది.

అయితే రాశి ఖ‌న్నా మాత్రం త‌న‌దైన శైలిలో రివ్యూ ఇచ్చింది. `బేబీ సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంది, ఈ సినిమాని చూస్తున్నంత సేపు నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. ఆనంద్, వైష్ణవి చాలా బాగా నటించారు. డైరెక్టర్ సాయి రాజేష్ గారు చ‌క్క‌గా సినిమాను తీర్చిదిద్దారు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. థియేట‌ర్స్ కి వ‌చ్చి అంద‌రూ బేబీని చూడండి` అంటూ రాశి ఖ‌న్నా చెప్పుకొచ్చింది. మ‌రోవైపు విజ‌య్ మీడియాతో మాట్లాడుతూ.. `సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు, మొత్తానికి ఏడిపించేశారు` అని పేర్కొన్నారు. దీంతో వీరి రియాక్ష‌న్స్ వైర‌ల్ గా మారాయి.