పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా మేనల్లుడు..!!

టాలీవుడ్లో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవలే విరూపాక్ష సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటిస్తూ ఉన్నారు. తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమా సక్సెస్ కావాలని శ్రీకాళహస్తి, కాణిపాకం, కడప దర్గా వంటి వాటిని దర్శించడం జరిగింది. అంతేకాకుండా తను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఇలా ప్రత్యేకమైన దేవాలయాలలో పూజలు చేయించుకుంటున్నారు. బ్రో సినిమా ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Sai Dharam Tej stills at Tirupati Airport, Kanipakam, Sri KalaHasthi

సాయి ధరమ్ ను వెళ్ళిన చోట ఆయన అభిమానులు సైతం ఘన స్వాగతం పలికారు.శ్రీకాళహస్తి కాణిపాకం వంటి పలుచోట్ల ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజను చూసేందుకు అభిమానుల సైతం భారీగా తరలి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది తనకు పునర్జన్మ అని.. దేవుడు పునర్జన్మ ప్రసాదించారు అందుకే ఆలయాలను సందర్శిస్తూ ఇలా కడప దర్గాకు వచ్చానని తెలిపారు ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Sai Dharam Tej idly sits at home! Reason Pawan Kalyan

బ్రో సినిమాల తన మామయ్యతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి అని ఆయనతో కలిసి నటించడం ఒక అదృష్టంగా భావిస్తానని తెలిపారు. రాజకీయాలలో తన మామయ్య బిజీగా ఉన్నారని తెలుపుతూ రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య కోరారని కానీ నేను సినిమా రంగంలోనే ఉంటానని చెప్పానని తెలిపారు. కానీ మా మామయ్య అంటే తనకు ప్రాణం అని తెలియజేశారు సాయి ధరమ్ తేజ్ .ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.