దిక్కు తోచని స్ధితిలో ఎన్టీఆర్ హీరోయిన్.. జాలిపడుతున్న జనాలు..!!

మన ముందే మన కళ్ళ ఎదుట మన తోటి వారు ఎదిగిపోతూ ఉంటే చూసి తట్టుకోలేం. కొంతమంది వాళ్ళని వెనక్కి లాగానే ఆలోచిస్తూ ఉంటారు. మరి కొంతమంది వాళ్ళ లాగా మనం ఎందుకు ఎదగలేక పోతున్నామని బాధపడుతూ ఉంటారు . అయితే సెకండ్ కోవాలకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఎన్ టీఆర్ హీరోయిన్ గా పాపులారిటి సంపాదించుకున్న రాశి ఖన్నా . పాపం తెలిసి చేస్తుందో ..తెలియక చేస్తుందో తెలియదు కానీ.. ఈ ముద్దుగుమ్మ తెలిసి తెలియక తనంతో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కొన్ని సార్లు బెడిసి కొడుతున్నాయి.

టాలీవుడ్ – బాలీవుడ్-కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇంకా ఆ క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది . కేవలం రాశిఖన్నా అంటే హీరోయిన్ గానే చూస్తున్నారు కానీ అమ్మడు ని పర్సనల్గా తీసుకొని ..ఈ అమ్మడు లేకపోతే ఈ సినిమా బాగోదేమో అన్న స్థాయి కామెంట్స్ అందుకోలేక పోతుంది . అంతేకాదు రాశిఖన్నా తోటి హీరోయిన్ లు అందరూ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ సెటిల్ అయిపోతుంటే ..రాశి ఖన్నా మాత్రం ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుంది .

ఈ క్రమంలోనే ఆమె ఎంతో ఇష్టపడిన వరుణ్ తేజ్ సైతం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉండడంతో రాశిఖన్నా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయిందట . అంతేనా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయిన రోజు ఇంట్లో కూర్చుని బోరున ఏడ్చేసింది అన్న వార్తలు వైరల్ అయ్యాయి . ఈ క్రమంలోనే అటు సినిమాల పరంగా ముందుకెళ్ళలేక.. ఇలా ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటే భరించలేక దిక్కు తోచని స్థితిలో ఉండిపోయిందట రాశి ఖన్నా. చూద్దాం మరి ఈ తలనొప్పుల నుండి ఎలా ముందుకు వెళ్తుందో..?