ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అందాల సోయగం కృతి శెట్టి.. కెరీర్ ఆరంభంలో యమ జోరు చూపించింది. వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ అందరిని అట్రాక్ట్ చేసింది. కానీ గత ఏడాది ద్వితీయార్థం నుంచి ఈ బ్యూటీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కస్టడీ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఫలితం లేకుండా పోయింది.
బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఫ్లాప్స్ పడడంతో కృతి శెట్టి కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. ఆమె వైపు కూడా ఎవరు చూడటం లేదు. టోవినో థామస్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళం మూవీ తప్పితే ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఇలాంటి తరుణంలో కృతి శెట్టి ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ మూవీ లో ఛాన్స్ దక్కించుకుంది.
పొన్నియిన్ సెల్వన్ మూవీ తో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన కోలీవుడ్ స్టార్ జయం రవి తో ఓ సినిమా చేయబోతోంది. అర్జునన్ దర్శకత్వంలో ఆయన `జీని` అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా చెన్నైలో ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ఛాన్స్ కొట్టేసింది. అయితే కృతి శెట్టితో పాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి కూడా హీరోయిన్స్గా కనిపించబోతున్నారు. అలాగు ఒకప్పటి హీరోయిన్ దేవయాని ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.