`బిగ్ బాస్ 7`లో సంద‌డి చేయ‌బోతున్న‌ కార్తీకదీపం మోనిత.. హాట్ టాపిక్ గా రెమ్యున‌రేష‌న్‌!?

బుల్లితెరపై మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 7 స్టార్ట్ కాబోతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌ను హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున‌నే 7వ సీన‌జ‌న్ కు కూడా హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని ప్రోమోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అలాగే ఎప్ప‌టిలాగానే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా లీక్ అయింది.

బుల్లితెర, వెండితెరతో పాటు ప‌లువురు యూట్యూబ్ స్టార్స్ బిగ్ బాస్ 7లో పాల్గొన‌బోతున్నారు. జబర్దస్త్ వర్ష, సింగర్ మోహన భోగరాజు, నటి శ్రీవాణి, బుల్లెట్‌ భాస్కర్‌, కన్నడ నటి నవ్యస్వామి, బుల్లితెర న‌టుడు అమర్ దీప్ చౌదరి, ఆయ‌న వైఫ్ తేజస్విని, యూట్యూబర్ శ్వేతా నాయుడు త‌దిత‌రులు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన‌బోతున్నారు.

అలాగే కార్తీక‌దీపం సీరియ‌ల్ లో లేడీ విల‌న్ గా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న మోనిత అలియాస్ శోభా శెట్టి కూడా బిగ్ బాస్ 7లో కంటిస్టెంట్ గా సంద‌డి చేయ‌బోతోంది. ఈమె ఎంట్రీ దాదాపు క‌న్ఫార్మ్ అని అంటున్నారు. అయితే శోభా శెట్టి రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారానికి ఈ బ్యూటీ రూ. ల‌క్ష రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తుంద‌ట‌. అందుకు ఒక్క రూపాయి త‌గ్గినా తాను రాన‌ని శోభా శెట్టి చెప్పింద‌ట‌. దాంతో ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు మేక‌ర్స్ ఒప్పుకున్నార‌ట‌. బిగ్ బాస్ 7 తెలుగులో హైయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్స్ లో శోభా శెట్టి ఒక‌ర‌ని తెలుస్తోంది.