రూ. 2 కోట్లు ఖ‌రీదు చేసే డైమండ్ రింగ్ ను ఉపాస‌న త‌మ‌న్నాకే ఎందుకిచ్చిందో తెలుసా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా వ‌ద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ ఉందన్న సంగ‌తి తెలిసిందే. అంతపెద్ద డైమండ్‏తో ఈ రింగ్ ను డిజైన్ చేశారు. ఈ డైమండ్ సైజ్, బరువు చాలా పెద్ద‌గా ఉంటుంది. అలాగే ఈ డైమండ్‌ రింగ్ ఖ‌రీదు అక్ష‌రాల‌ రూ. 2 కోట్లు. ఈ రింగ్ త‌మ‌న్నాకు మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల గిఫ్ట్ గా ఇచ్చింది.

 

అయితే అంత ఖ‌రీదైన డైమండ్ రింగ్ ను ఉపాస‌న త‌మ‌న్నాకే ఎందుకిచ్చింది..? అన్న‌ది చాలా మందికి తెలియ‌దు. అయితే అందుకు ఓ కార‌ణం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేసిన ఈ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌య‌న‌తార మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తే.. త‌మ‌న్నా సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2019లో విడుద‌లైన ఈ చిత్రం భారీ విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమా చూశాక ఉపాస‌న త‌మ‌న్నా న‌ట‌న‌కు ఫిదా అయిపోయింది. నరసింహారెడ్డిని ప్రేమించిన వ్యక్తిగా, ఆయన పోరాటాన్ని అందరికీ తెలిసేలా చేసే నర్తకకిగా, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనిత లక్ష్మి పాత్ర‌లో త‌మ‌న్నా అద‌ర‌గొట్టేంది. తమన్నా నటనకు మంత్రముగ్దులైన ఉపాస‌న‌.. రూ. 2 కోట్లు ఖ‌రీదు చేసే డైమండ్ రింగ్ ను కానుక‌గా ఇచ్చి అభినంద‌న‌లు తెలిపింది. అద‌న్న‌మాట సంగ‌తి.