టిడిపి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ కక్ష సాధింపు చర్యలకు టిడిపికి చుక్కలు కనబడుతున్నాయి. అయితే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని అలాగే ఇబ్బంది పెట్టారు. ఇక వైసీపీ అవన్నీ గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక గతంలో తమని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు దిగిందని తెలుస్తుంది.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది టిడిపి నేతలు, కార్యకర్తలు జైలుకు వెళ్లారు..వారిపై కేసులు పెట్టారో లెక్క లేదు. జగన్ ని విమర్శిస్తే కేసులు..సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ఏమైనా పోస్టు పెడితే కేసు..జైలుకు పంపించేస్తున్నారు. ఇక సిఐడి..టిడిపి కోసమే ఉందా? అనే పరిస్తితి కూడా కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే టిడిపి నేతలు అధికారంలో ఉండగా అక్రమాలు చేశారని చెప్పి..పలువురిపై కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపారు. ఇలా రకరకాలుగా వైసీపీ చేతిలో టిడిపి నేతలు చావు దెబ్బతిన్నారు.
అయితే వీటి అన్నిటికి ఖచ్చితంగా బదులు చెబుతామని…రేపు అనే రోజు టిడిపి అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని అంటున్నారు. ఈ క్రమంలో ఎవరైతే తమని ఇబ్బందులకు గురి చేశారో..ఆ అధికారులు, నేతల పేర్లు తాను రాసుకున్నానని లోకేష్ చెప్పుకొచ్చారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన..ఓ రెడ్ బుక్ని చూపించారు. ఈ బుక్ లో ఎవరైతే తమ పార్టీ వాళ్లపై అక్రమంగా కేసులు పెట్టడం, జైలుకు పంపడం, మానసికంగా, శరీరకంగా హింసలకు గురి చేశారో వారి పేర్లని రాసుకున్నానని లోకేష్ అన్నారు. మరి టిడిపి అధికారంలోకి వస్తుందా? వస్తే వారందరిపై రివెంజ్ ఉంటుందా? అనేది చూడాలి.