ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు .అలాగే కీలకమైన పాత్రలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా పవన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం .ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
సలార్ సినిమాకు సంబంధించి ఇటీవల షూటింగ్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా నటుడు జగపతిబాబు ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు తాను సలార్ సినిమా షూటింగ్లో కేవలం ఐదు రోజులు మాత్రమే పాల్గొన్నాను అంటూ తెలిపారు. దీంతో అభిమానులు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందా అని భయపడిపోయారు.. కానీ టీజర్ రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతూ ఉంటుందని అభిమానులు ఖుషి అయ్యారు.
కానీ తాజాగా మరొకసారి ఈ సినిమా పైన మాట్లాడుతూ జగపతిబాబు మెయిన్ విలన్ అనే అందరూ అనుకున్నారు కానీ తనకు ప్రభాస్ కాంబినేషన్లు ఒక సీను కూడా లేదు అని తెలిపారు.. హీరో విలన్ ఒకే షాట్లో కనిపించకపోవడం ఏంట అని చర్చ అందరిలోనూ మొదలవుతోంది. అయితే సలార్ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నారు. రెండవ భాగంలో వీరిద్దరూ ఎదురు పడే సన్నివేశాలు ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరి జగపతిబాబు ఇలా చెప్పడంతో మూవీ ఎలా వచ్చిందా అని అనుమానాలు కూడా అభిమానులలో మొదలవుతున్నాయి. మరి ఈ చిత్రం ట్రైలర్ వల్ల ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో చూడాలి మరి.