పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. ఫిక్సయిన బ్రో ఓటీటీ రిలీజ్ డేట్..

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు తో కలిసి నటించిన సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బుకింగ్స్ కూడా చాలా జోరుగా జరిగాయి. ఈ సినిమా అమెరికా లాంటి దేశాలో ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్  చేసే సీన్స్ చాలానే ఉన్నాయి. భీమ్లా నాయక్,వకీల్ సాబ్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ‘బ్రో’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

తమిళ్లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ సినిమాని తెలుగులో ‘బ్రో’ అనే పేరుతో రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించగా , త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్,  స్క్రీన్ ప్లే  అందించాడు. ఈరోజు బ్రో సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుంది. అయితే థియేటర్స్ వెళ్లలేని చాలామంది ప్రేక్షకులు మాత్రం ఓడిటీ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. బ్రో సినిమా ని నెట్ ఫ్లిక్స్ సంస్థ బారి ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ సినిమా విడుదలైన నాలుగైదు వారల గ్యాప్ తో ఓటీటి లో విడుదల కానుంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం తో ఆ సందర్భంగా బ్రో సినిమాని ఓటీటి లో స్ట్రీమ్మింగ్ చేస్తారని తెలుస్తుంది.


ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక అమెరికా లాంటి దేశాల్లో బ్రో సినిమా చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. రిలీజ్ కి ముందు ఈ సినిమాలోని పాటలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ టీజర్,ట్రైలర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ్ లో తెరకేక్కిన వినోదయ సిత్తం సినిమా స్టోరీ ఒక 50 ఏళ్ళ వయసు ఉన్న మనిషి జీవితంలోని కష్టాలను వివరించడం అయితే బ్రో సినిమాలో మాత్రం ఒక యువకుడు తండ్రి మరణించిన తరువాత అతను ఎదుర్కొన్న సమస్యల గురించి చూపించారు. ఇక పవన్, తేజ్ ల యాక్టింగ్ ఆడియన్స్ ని ఫుల్ గా ఖుషి చేస్తుంది.