చిరంజీవికి స‌ర్జ‌రీ.. అమెరికా టూర్ వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా..?

మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. రీసెంట్ గా ఆయ‌న‌కు ఓ స‌ర్జ‌రీ జ‌రిగింద‌ట‌. కొద్ది రోజుల క్రితం చిరంజీవి భార్య సురేఖ‌తో క‌లిసి అమెరికాలో వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ టూర్ వెకేష‌న్ కోస‌మే కాద‌న్న విస‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెడిక‌ల్ ప‌నిమీద చిరంజీవి అమెరికా వెళ్లార‌ట‌.

అక్క‌డ ఆయ‌న‌కు ఓ స‌ర్జ‌రీ కూడా జ‌రిగింద‌ని తెలుస్తోంది. గ‌త కొన్నాళ్ల నుంచి చిరంజీవి కాలి నొప్పితో బాగా ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. వైద్యులను సంప్ర‌దించ‌గా.. చిన్న స‌ర్జ‌రీ చేయాల‌ని సూచించార‌ట‌. దాంతో భోళా శంక‌ర్ మూవీ వ‌ర్క్ పూర్తైన వెంట‌నే చిరంజీవి అమెరికా టూర్ ను ప్లాన్ చేసుకున్నారు. భార్య‌తో క‌లిసి అక్క‌డికి వెళ్లారు.

అక్క‌డ ఓ ప్ర‌ముఖ హాస్ప‌ట‌ల్ లో ఓ చిన్న పాటి స‌ర్జ‌రీ చేయించుకుని చిరంజీవి వ‌చ్చారు. ఈ విష‌యం కాస్త లేట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఫ్యాన్స్ కంగారు ప‌డాల్సినంత పెద్ద స‌మ‌స్యేమి కాద‌ట‌. ప్ర‌స్తుతం చిరంజీవి చాలా హెల్తీగా, యాక్టివ్ గా ఉన్నార‌ని స‌మాచారం. అన్న‌ట్లు త‌ర్వ‌లోనే చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ విడుద‌ల కాబోతోంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. కీర్తి సురేష్ కీల‌క పాత్ర‌ను పోషించింది. ఆగ‌స్టు 11న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.