జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాణహాని ఉందా.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది.. అలాగే టిడిపి పార్టీని కూడా సమయం దొరికినప్పుడల్లా పలు రకాల కామెంట్లను చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి..అప్పుడప్పుడు పలు రకాల హీరోయిన్ల పైన కూడా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఈమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి.

 

అలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న శ్రీ రెడ్డి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.. శ్రీ రెడ్డి తారక్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్కు రాజకీయ భవిష్యత్తు ఉందని ఆయన చాలా ధైర్యవంతుడని ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరని తెలిపింది.. నందమూరి కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్న ఆ విషయాలను బయట పెట్టకుండా చాలా ఒత్తిడికి గురవుతున్నారు.. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా డౌట్ రాకుండా ఇండస్ట్రీలో తన తాత పేరుకు చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది శ్రీరెడ్డి.

సినిమాలలో స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల పైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాల కోణాలలో ఆయనకే రావడం ఇష్టం లేదని తెలిపింది. బాలయ్య కూతురుని చంద్రబాబు కోడలుగా చేసుకోవడం వెనుక కూడా చాలా ప్లానింగ్ ఉందని తెలిపింది.. చంద్రబాబు మరణించాక టిడిపి పార్టీలో ఒక పెద్ద దుమారం చెలరేగిపోతుందని తెలిపింది.. టిడిపి పార్టీ నాయకులు కూడా ఎన్టీఆర్ పైన చాలా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి రాకపోవడానికి కారణం చంద్రబాబు వల్ల తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందని తెలిపింది.. అందుకే ఎన్టీఆర్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వలేదని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.