మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన త‌మ‌న్నా.. అస‌లు అది డైమండ్ రింగే కాద‌ట‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు సంబంధించి ఓ న్యూస్ గ‌త రెండు రోజులుగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. త‌మ‌న్నా వ‌ద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ ఉందని.. దాని ఖ‌రీదు రూ. 2 కోట్లు ఉంటుంది అన్న‌దే ఆ వార్త సారాంశం. అంతేకాదు, ఆ రింగ్ ను త‌మ‌న్నాకు మెగా కోడలు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల గిఫ్ట్ గా ఇచ్చింద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

2019లో విడుద‌లైన `సైరా నరసింహారెడ్డి` సినిమాలో త‌మ‌న్నా న‌ట‌న‌కు ఉపాస‌న ఫిదా అవ్వ‌డం వ‌ల్లే.. ఆమెకు ఆ డైమండ్ రింగ్ ఇచ్చిద‌న్న టాక్ ఉంది. దీనికి తోడు త‌మ‌న్నా ఆ డైమంగ్ రింగ్ పెట్టుకుని సిగ్గుప‌డుతున్న ఫోటో కూడా తెగ వైర‌ల్ అవుతోంది. అయితే తాజాగా ఈ విష‌యంపై త‌మ‌న్నా మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది.

అస‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలో త‌మ‌న్నా చేతికి ఉన్న‌ది డైమండ్ రింగే కాద‌ట‌. న‌మ్మ‌లేక‌పోయినా ఇదే నిజం. త‌మ‌న్నా స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. `ఇది మీకు చెప్పడానికి చాలా బాధపడుతున్నాను.. ఆరోజు మేము బాటిల్ ఓపెనర్‏తో ఫోటో షూట్ చేశాం.. నేను వేలికి ధరించినది నిజమైన వజ్రం కాదు` అంటూ త‌మ‌న్నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్ల‌డించింది. దీంతో నెటిజ‌న్ల‌కు దిమ్మ‌తిరిగిపోయింది. ఎంత మోస‌పోయాము అంటూ త‌మ‌న్నా పోస్ట్ కు కామెంట్లు పెడుతున్నారు.