పెళ్లై విడాకులైన హీరోతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమాయణం నడిపించబోతోంది. అయితే ఇది రియల్ గా కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీలీల, మృణాల్ ఠాకూర్ రాకతో రష్మిక క్రేజ్ పడిపోయిందని.. ఆమెకు ఆఫర్ల రావడం లేదన్న టాక్ నెట్టింట జోరుగా సాగుతోంది. అయితే తనపై ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేవారికి రష్మిక దిమ్మతిరిగే షాకిచ్చింది.
ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఐశ్వర్యతో విడాకులు అయిన తర్వాత ధనుష్ ఫోకస్ మొత్తం కెరీర్ పైనే పెట్టాడు. గత ఏడాది తెలుగులో డైరెక్ట్గా `సార్` మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలాగే ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ మూవీకి కమిట్ అయ్యాడు.
సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. అయితే ఇందులో ధనుష్ కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్ గా ఎంపిక అయిందని తెలుస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యారట. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా శేఖర్ కమ్ముల ఈ మూవీని రూపొందిస్తున్నాడట. అలాగే మంచి మెసేజ్ కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారట.