వైఫ్ తో వెకేషన్ కు చెక్కేసిన చిరంజీవి.. వారి విమాన ప్రయాణం ఖర్చు ఎంతో తెలిస్తే షాకైపోతారు!

మెగాస్టార్ చిరంజీవి ఒక్క‌సారి ఏదైనా సినిమాను స్టార్ట్ చేశాడు అంటూ గ్యాప్ తీసుకోకుండా వ‌ర్క్ మూడ్ లోనే ఉంటారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వ‌ర‌కు నిద్ర‌పోరు. తాజాగా చిరంజీవి `భోళా శంక‌ర్‌`ను పూర్తి చేశారు. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్‌, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు.

ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. చిరంజీవి రెండు రోజుల క్రిత‌మే ఈ సినిమాకు త‌న డ‌బ్బింగ్ వ‌ర్క్ ను పూర్తి చేశాడు. ఇక అలా వ‌ర్క్ కంప్లీట్ అయిందో లేదో.. ఇలా వైఫ్ తో వెకేష‌న్ కు చెక్కేశాడు. నెక్స్ట్ సినిమా షూటింగ్‌ మొదలుపెడితే గ్యాప్ ఉండదని భావించిన చిరంజీవి.. సతీమణి సురేఖతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఫ్లైట్ జ‌ర్నీకి సంబంధించిన ఫోటోల‌ను చిరంజీవి స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

రిఫ్రెష్‌మెంట్ కోసం ఆమెరికా వెళ్తున్నామ‌ని.. అక్క‌డ నుంచి వ‌చ్చిన త‌ర్వాత గోల్డ్ బాక్స్ ఎంట‌ర్టైన‌ర్‌మెంట్స్ బ్యాన‌ర్ లో త‌న త‌దుప‌రి చిత్రం ప్రారంభం కానుంద‌ని చిరంజీవి తెలిపారు. అయితే చిరంజీవి దంప‌తుల యూఎస్ విమాన ప్రయాణం ఖర్చు ఎంతో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లో వీరు ప్రయాణం చేశారు. ఇందుకోసం చిరు దంపతులు ఏకంగా రూ. 8 లక్షల‌కు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. దీంతో ఈ విష‌యం నెట్టింట వైర‌ల్ గా మారింది.