సెన్సార్ పూర్తి చేసుకున్న బ్రో మూవీ..!!

పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు.. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూడడం జరుగుతోంది .అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం టీజర్ పోస్టర్ల తోనే ప్రేక్షకులను బాగా అలరించారు పాటలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇందులో మరొకసారి పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తమిళంలో సక్సెస్ అయిన వినోదయ సీత్తం చిత్రానికి రీమిక్కుగా తెలుగులో తెరకెక్కిస్తూ ఉన్నారు.

Bro Movie Poster: Pawan Kalyan and Sai Dharam Tej Shine In Their Stylish Avatars

ఇటీవల విడుదలైన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది.. ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం దాదాపుగా 2 గంటల 16 నిమిషాలు రన్ టైం లాక్ అయినట్లుగా తెలుస్తోంది. బ్రో సినిమాలో పవన్ తేజ్ మధ్య బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుందని ఇందులో పవన్ చిన్న ఫైట్ సీను కూడా ఉంటుందని తెలుస్తోంది.

కానీ మెయిన్ లీడ్ అంతా సాయి ధరంతేజ్ నటించగా పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారని తెలుస్తోంది.ఇప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. బ్రో సినిమాలో నటించడంతో సాయి ధరంతేజ్ ను ప్రతి ఒక్కరు కూడా బ్రో అని పిలుస్తూ ఉన్నారని సరదాగా తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు అభిమానులను ఈ సినిమా మెప్పించగలదో చూడాలి మరి.