పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా సలార్ రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ సినిమా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో ప్రభాస్ లుక్ ను చూపించనందుకు ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినా.. డార్లింగ్ క్యారెక్టర్ ను డైనోసార్తో కంపేర్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. అయితే సెప్టెంబర్ 28నే రిలీజ్ చేయడం వెనక పెద్ద కథే ఉంది. పక్కా ప్లానింగ్ తోనే సలార్ విడుదలకు మేకర్స్ ఆ రోజును ఎంచుకున్నారు.
మామూలుగా శుక్రవారం సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ, సెప్టెంబర్ 28 గురువారం నాడు సలార్ ను విడుదల చేస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్కు ఉన్న క్రేజ్ వల్ల ఈ రోజు బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 29 శుక్రవారం, సెప్టెంబర్ 30 శనివారం మరియు అక్టోబర్ 1ఆదివారం.. వీకెండ్ కావటంతో మూడు రోజులు ప్రీ బుకింగ్స్తో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. ఇక సోమవారం కూడా సలార్ కు ప్లస్సే అయింది. ఎందుకంటే, ఆ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. నేషనల్ హాలీడే కావడంతో ఆ రోజు కూడా సలార్ బాక్సాఫీస్ దుమ్ము దుమారం రేపుతుంది. ఇలా ఐదు రోజులు కలిసి వస్తానే ప్రశాంత్ నీల్ సలార్ విడుదలకు ఆ రోజును ఖాయం చేయించాడు. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ మామ నువ్వు కేక అంటూ తెగ పొగిడేస్తున్నారు.