ఆల్రెడీ శివ నిర్మాణ దర్శకత్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ కు ముందే గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా.. అలాగే పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు.
ఈ రెండు ప్రాజెక్టులు ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యాయి. పరుశురామ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. `గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం పరుశురామ్, విజయ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ మూవీ స్టోరీపై కొన్ని లీకులు బయటకు వచ్చింది. ఇది ఒక పక్కా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట. ఇందులో విజయ్ దేవరకొండ నిరుద్యోగిగా కనిపిస్తాడు. అయితే అతడికి చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలనే ఓ కల ఉంటుంది. దాంతో ఉద్యోగం కోసం అన్వేషిస్తూనే, ఎలాగైనా అమెరికా వెళ్లడం కోసం నానా పాట్లు పడుతుంటాడట. ఇక అమెరికాలో నివాసం ఉంటే హీరోయిన్.. ఒక డాక్యుమెంటరీ షూటింగ్ కోసం ఇండియాకి వస్తుంది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం జరిగి.. అది కాస్త ప్రేమగా మారుతుందట. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్నదే ఈ మూవీ స్టోరీ అని టాక్ నడుస్తోంది. అన్నట్లు ఈ మూవీకి `ఫ్యామిలీ స్టార్` అనే టైటిల్ కూడా పరిశీలనతో ఉంది. ఇందులో హీరో కుటుంబానికి, కుటుంబ విలువలకు ఎంతో ప్రధాన్యత ఇస్తాడట. అందుకే ఆ టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారని అంటున్నారు.