పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ ఇది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నుడమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను దక్కించుకుంది.
అయితే టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ కు క్రేజ్ దృష్ట్యా మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ వసూళ్ల సునామీ సృష్టించింది. మూడు రోజుల్లోనే రూ. 150 కోట్లకు పైగా షేర్ వసూలను రాబట్టింది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ విడుదలకు ముందే ప్రభాస్ మోకాలి చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆయన ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఇటలీలో సేద తీరేందుకు ఓ విలాసవంతమైన విల్లాను రెంట్ కు తీసుకున్నాడట. సన్నిహితులతో కలిసి ఆ విల్లాలోనే ప్రభాస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడట. అయితే ఆ విల్లా రెంట్ ఎంతో తెలిస్తే కళ్ళు తేలేస్తారు. ఎందుకంటే ఆ రెంట్ డబ్బులతో ఇక్కడ ఓ ఇల్లులే కట్టేసుకోవచ్చు. వెకేషన్ విల్లా కోసం ప్రభాస్ ఏకంగా నెలకు రూ. 40 లక్షలు చెల్లిస్తున్నాడట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ వెకేషన్ పూర్తయిన వెంటనే ప్రభాస ప్రాజెక్టు కే, సలార్ చిత్రాలతో బిజీ కానున్నాడు.