టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా.. అందరికీ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉంటారు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ తేజ్ .. ఆయన భార్య ఉపాసన . ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వయసులో చరణ్ కంటే ఉపాసన పెద్దది . అయినా సరే వీళ్ల మధ్య ప్రేమ బంధం ఏర్పడి ..ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకొని.. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఉపాసన పండు లాంటి పాపకి లేదా బాబుకి జన్మనివ్వబోతుంది.
ఈ క్రమంలోనే ఉపాసనకి సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా నేడు వాళ్ళ 11వ పెళ్లిరోజును గ్రాండ్గా జరుపుకుంటున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఆయన ఫ్యాన్స్ .. ఆయన కుటుంబ సభ్యులు వీళ్ళకి విష్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి కూడా కొడుకు కోడలికి మైండ్ బ్లోయింగ్ స్టైల్ లో విష్ చేశారు .
వాళ్ళిద్దరి ఫోటోలు షేర్ చేస్తూ “11వ సంవత్సర పెళ్లిరోజు శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చాడు . అంతేకాదు ..”మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలని. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న మీకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి ” అంటూ విష్ చేశారు. అంతేకాదు ఇద్దరు తల్లిదండ్రులు కాబోతున్న క్రమంలో బేబీ డాల్ ని గిఫ్ట్ గా ప్రజెంట్ చేశారట .అంతేకాదు ఉపాసనకి రామ్ చరణ్ కి ఉపాసన కి డైమండ్ రింగ్స్ కూడా ప్రసెంట్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!
Hi Charan and Upsy !
On this special day, we wish you both a happy wedding anniversary,
You both have made us proud and happy beyond measure 🤗🤗
As you step into the journey of parenthood, we wish you all the best,
May your love for your child be a story that others will love… pic.twitter.com/1bSPrRv3UO— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2023