పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తొలిసారి జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు.
ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న.. కృతి సనన్ తాజాగా ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది. ప్రభాస్ ఎప్పుడు చాలా కూల్ గా ఉంటాడని.. ఎదుటివారిని ఎంతగానో గౌరవిస్తాడని కృతి సనన్ కొనియాడింది. మొదట్లో అతను కాస్త సిగ్గుపడినా.. ఆ తర్వాత బాగా కలిసిపోయాడని, చాలా ఓపెన్ గా ఉండేవాడని చెప్పుకొచ్చింది.
సైలెంట్ గా తన పని తాను చేసుకోపోయేవాడని.. కళ్ళతోనే తన భావాలను వ్యక్తపరిచేవాడు.. ఆదిపురుష్ లో నా పక్కన రాఘవ ప్రభాస్ ను తప్ప మరొకరిని అస్సలు ఊహించుకోలేను అంటూ కృతి సనన్ వ్యాఖ్యానించింది. దీంతో ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. గత కొంతకాలం నుంచి ప్రభాస్, కృతి సనన్ మధ్య సంథింగ్.. సంథింగ్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కృతి ససనన్ కామెంట్స్ తో మరోసారి ఆ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తనకు ప్రభాసే పర్ఫెక్ట్ పార్ట్నర్ అని కృతి సనన్ ఒప్పేసుకుంది రోయ్ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.