తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ సినిమాలు!

టాలీవుడ్ స్థాయి నేడు దిగంతాలకు చేరింది. అవును, ఇక్కడ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ముదులుపుతున్నాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఇక్కడి సినిమా రిలీజుకి ముందే సత్తాచాటుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ ఆర్ ఆర్” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 191 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఆ తరువాత రికార్డ్ కూడా మన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పైనే వుంది. ఆయన దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా అనుష్క … తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన బాహుబలి 2 మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మూడవది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘సాహో’ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో 121.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు భోగట్టా.

అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నటించగా ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 16 వ తేదీన తెలుగు, హిందీ , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ మూవీ కి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు భోగట్టా. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందినటువంటి ఆచార్య సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 107.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.