పెళ్ళి తరువాత లావణ్య-వరుణ్ కొత్త కాపురం.. మూడుగా ముక్కలవ్వబోతున్న మెగా ఫ్యామిలీ..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల పేర్లు ఏ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చాయో మనందరికీ తెలిసిందే . కాగా గత కొన్ని రోజుల నుంచి వీళ్ళ ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా జూన్ 9వ తేదీ రాత్రి నాగబాబు నివాసంలో చాలా గ్రాండ్గా వీళ్ళ నిశ్చితార్ధం చేసుకోవడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధపు వేడుకల్లో కట్టుకున్న చీర.. ఆమె పెట్టుకున్నా రింగ్ ..జ్యువెలరీ.. హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

లక్షలు ఖరీదు చేసే నగలను ధరించి చాలా స్టైలిష్ ట్రెండీగా కనిపించింది . కాగ ఇదే క్రమంలో పెళ్లి తర్వాత లావణ్య కొత్త కాపురం పెట్టబోతుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే నాగబాబు కూతురు నిహారిక పెళ్లి చేసుకుని విడాకులు తీసుకునింది . ఈ విషయం నచ్చక నిహారికను నాగబాబు దూరం పెట్టారట . అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక నాగబాబు ఓకే ఇంట్లో ఉండడం లేదు . నిహారిక తండ్రి కి దూరంగా వేరే ఫ్లాట్ తీసుకొని ఉంటుందట .

అంతేకాదు పెళ్లి తర్వాత లావణ్య కూడా వరుణ్ ని తీసుకుని కొత్త కాపురం పెట్టడానికి అప్పుడే ఫ్లాట్ కూడా రెడీ చేసుకున్నారట. సొంత డబ్బులతో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత ఓవైపు లావణ్య-వరుణ్.. మరోవైపు నిహారిక ..మరోవైపు నాగబాబు-పద్మ ఇలా ముగ్గురు మూడు విధాలుగా చీలిపోయి లైఫ్ను ముందుకు తీసుకెళ్లబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు జనాలు . ఏది ఏమైనా సరే ఓ పక్క కొడుకు పెళ్లి అవుతుందని ఆనందపడాలో లేక కూతురు డివర్స్ అయింది అని బాధపడాలో తెలియక నాగబాబు అయోమయ స్థితిలో ఉండి పోయాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!