ఆది పురుష్.. అదిరిపోయిన ట్విట్టర్ టాక్.. కానీ..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం రామాయణం వంటి సబ్జెక్టుతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్.. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్.. తదితర నటీనటులు సైతం ఇతర పాత్రలలో నటించడం జరిగింది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఆది పురం సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత కొంతమంది ఆడియన్స్ అభిప్రాయాల్ని తమ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. అనూహ్యంగా ఆది పురుష్ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఈ చిత్రానికి తిరుగు లేదని తెలియజేస్తూ ఉన్నారు.. ప్రభాస్ కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటన చాలా అద్భుతంగా ఉందని..VFX కూడా అదిరిపోయే రేంజ్ లో ఉందంటూ తెలియజేస్తున్నారు.ప్రభాస్ మాత్రం రాముడు పాత్రలు చాలా అద్భుతంగా మెప్పించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫస్టాఫ్ పూర్తిగా ప్రేక్షకులను ఎగ్జిట్ అయ్యేలా చేస్తోందని డైరెక్టర్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారని తెలియజేస్తున్నారు.. పాటలు కూడా ఇందులో కాస్త ప్లస్ అయ్యాయని తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా జైశ్రీరామ్ సాంగ్ అందరిని ఆకట్టుకుందంటూ తెలియజేస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు అయితే ఆది పురుష్..VFX పట్ల కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ కావడంతో ఈ సినిమా పైన కాస్త నెగెటివిటీ ప్రచారం ఎక్కువగానే చేస్తున్నారు. లంకేశ్వరుడు పాత్రను సైఫ్ అలీ ఖాన్ కి డిజైన్ చేసిన తీరు కొంతమంది నెటిజన్లకు సైతం నచ్చలేదన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో విలన్స్ ని చూపించారని సమాచారం. ఇదొక్కటే లోపంగా తెలియజేస్తున్నారు నేటిజెన్లు. ట్విట్టర్ టాక్ అయితే అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.