“ఆది పురుష్” సినిమా హాల్లో హనుమంతుని సీటు చూసారా..? అన్నిటికన్నా స్పెషల్ ఇదే..!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది . అదే “ఆది పురుష్” టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ బడా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు సినిమాలో వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి అంటూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే . అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

మరీ ముఖ్యంగా రాముడి గెటప్ లో ప్రభాస్ సీత పాత్రలో కృతి చాలా అద్భుతంగా ఆకట్టుకున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోనే డైరెక్టర్ ఓం రావత్ ఇప్పటివరకు ఎవరు తీసుకొని డెసిషన్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఆది పురుష్ సినిమా ఏ థియేటర్లో అయితే ఆడుతుందో ఆ థియేటర్లో ప్రతి షో కి ఒక సీట్ హనుమంతునికి కేటాయించాలి అని నిర్ణయించుకున్నారు. వాళ్ళ అమ్మ కోరిక మేరకు ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు . మనం హనుమంతుని స్మరించిన ప్రతిసారి ఆయన మన చుట్టుపక్కలే ఉంటారు అని .. ఆ కారణంగానే ఆది పురుష్ సినిమాని హనుమంతుడు కూడా వీక్షించడానికి వీక్షిస్తాడు అన్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే రీసెంట్గా ఆది పురుష్ సినిమాలో హనుమంతుని సీటు తాలుకా ఫొటోస్ వైరల్ గా మారాయి . కాషాయ వస్త్రంతో పైన హనుమాన్ ఫోటో ప్రింట్ చేసి.. పూలమాల వేసి.. టెంకాయ కొట్టి.. సింధూరం పెట్టి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు ఈ సీటు పక్క సీటు కోసం జనాలు తాపత్రయ పడుతున్నారు. హనుమంతుని పక్కన కూర్చొని సినిమా చూడాలంటే అదృష్టం ఉండాలి అని.. ఆ సినిమా థియేటర్స్ లో ఆ సీటు పక్క సీటు కోసం తెగ తాపత్రయ పడుతున్నారు . అయితే అది ఎంతో అదృష్టం ఉంటే గాని దక్కదు. అయితే ఇలాంటి హనుమంతుని సీటు పక్కన కూర్చుని సినిమా చూడాలని పలువురు జనాలు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అయితే టికెట్స్ కోసం హ్యూజ్ డిమాండ్ ఉండడంతో టికెట్ రేట్ ఎక్కువ పెంచారన్న కామెంట్లు వినిపించాయి . అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది ఆదిపరుష్ టీం . మిగతా టిక్కెట్లు ఎలా ఉంటాయో వీటికి కూడా అలానే ఉంటాయి అంటూ క్లారిటీ ఇచ్చింది..!!