టాలీవుడ్ లో అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో దర్శకుడిగా మొదలైన అనిల్ రావిపూడి సినీ ప్రయాణం `ఎఫ్ 3` వరకు దిగ్విజయంగా కొనసాగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఈయన నటసింహం నందమూరి బాలకృష్ణ తో `భగవంత్ కేసరి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రను పోషిస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం దసరా పండుగ కానుక విడుదల కానుంది. అయితే బాలయ్య తర్వాత అనిల్ రావిపూడి స్టార్ హీరోకే టెండర్ వేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తదుపరి ప్రాజెక్టును తెరకెక్కించాలని అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్ వేశాడట. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ఇమేజ్ కు సరిపడేలా ఓ అదిరిపోయే కథను తయారు చేస్తున్నాడట. తాను తయారు చేసే ఈ కథ ఖచ్చితంగా ఎన్టీఆర్ ను ఆకట్టుకుంటుందని అనిల్ ధీమాగా ఉన్నాడట. మొత్తానికి బాబాయ్ తర్వాత అబ్బాయి తోనే సినిమా చేయాలని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యాడు. మరి ఎన్టీఆర్ ఆయనకు మోక్షం ఇస్తాడో లేదో చూడాలి.