“ఆదిపురుష్” సినిమా థియేటర్లకి వెళ్ళే వాళ్లు అవి వేసుకోకూడదు..? మూవీ టీం కొత్త కండీషన్స్..?

పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరావత్ డైరెక్షన్ లో తెరికెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా లో సీత పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ నటించి మెప్పించబోతుంది. భారీ తారాగాణంతో తెరకెక్కిన ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు.

కాగా ఈ క్రమంలోనే రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో భాగంగా నిన్న సాయంత్రం తిరుపతిలో “ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్గా జరిగింది . ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చిన్న జీయర్ స్వామి ప్రత్యేక ఆకర్ష్ణగా నిలిచారు. ఈ వేడుకకు హాజరై ప్రభాస్ ని ..ఆది పురుష్ టీం ని.. ఎంకరేజ్ చేశారు. కాగా ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొత్త న్యూస్ వైరల్ గా మారింది .

ఈ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే వాళ్ళు ఎవరు కూడా చెప్పులు ధరించకూడదు అంటూ మూవీ టీం క్రేజీ కండీషన్ పెట్టబోతుందట. అంతేకాదు ఇప్పటికే ఆది పురుష్..సినిమా రిలీజ్ అయ్యే ప్రతి ధియేటర్స్ లో ఒక్క సీటు హనుమతుడికి కెటాయించాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా తిరుపతిలో జరిగిన ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై హీరో ప్రభాస్ తో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులు అతిథులు ఎవరు చెప్పులు వేసుకో రాలేదు .

ఈ క్రమంలోని అందరూ చెప్పులు విప్పి కాళ్ళతో తిరిగారు . ఈ క్రమంలోనే ఆదిపురుష్ థియేటర్లకు వెళ్లే ఫ్యాన్స్కూ బ్డా చెప్పులు వేసుకోకూడదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనం ఏదైన గుడికి వెళ్ళిన చెప్పులు ఆలయం బయటే వదిలేయడం అదేవిధంగా ఆదిపురుష్ అనేది ఓ ఆలయం అందుకే ఈ సినిమాకి వెళ్లే వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు అంటూ మూవీ టీ భావిస్తుందట. దీని పై త్వరలోనే ఓ నోట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్..!!