“ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్: కాంట్రవర్శీ అవుతుందనే ప్రభాస్ జాగ్రత్త గా తప్పించుకున్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా “ఆది పురుస్” . ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న సాయంత్రం తిరుపతిలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈవెంట్ కి ప్రభాస్ చాలా లేటుగా అటెండ్ అయ్యారు. సినిమాకి సంబంధించిన నటీనటులు డైరెక్టర్ అందరూ హాజరైన రెండు గంటలకి ప్రభాస్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చారు .

అంతేకాదు ఆ తర్వాత చిన్న జీయర్ స్వామితో కొంతసేపు స్టేజిపై ఎక్కిన ప్రభాస్ ఆ తర్వాత పట్టుమంటే పది నిమిషాలు స్పీచ్ ఇచ్చి స్టేజ్ దిగి వెళ్ళిపోయారు . అంతేకాదు ప్రభాస్ ఎక్కడా కూడా మింగిల్ అయిన సందర్భాలు కనిపించలేదు . ఫోటోషూట్స్ కూడా ఎక్కువ తీయలేదు . పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అంటే ఏ రేంజ్ లో పబ్లిసిటీ ఉండాలి.. ఏ రేంజ్ లో ఫొటోస్ దిగాలి.. అవన్నీ ఆది పురుష్ సినిమాకి చేయలేదు . అంతేకాదు ప్రభాస్ మరీ ముఖ్యంగా కృతి సనంతో క్లోజ్గా మూవ్ అయిన సందర్భాల్లో లేవు .

ఆమెకు దూరం దూరంగా ఉంటూ వచ్చాడు. మరి ముఖ్యంగా స్టేజ్ పైకి ఎక్కి ఫొటోస్ కి ఫోజులు ఇవ్వమన్నప్పుడు కూడా ప్రభాస్ ఆమెకు దూరంగానే ఉంటూ వచ్చాడు. ఫోటోగ్రాఫర్ దగ్గరికి జరగండి అంటూ చెప్పారు. అయితే ప్రభాస్ కావాలనే కృటి సనన్ ని దూరం పెట్టారని.. లేకపోతే సోషల్ మీడియాలో మళ్లీ పెళ్లి వార్తలు లేనిపోని టార్చర్ పడాల్సి వస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్త కారణంగానే ఈ విషయం కాంట్రవర్సీ కాకుండా సేఫ్ జోన్ లో ఉండడానికి ప్రభాస్ ట్రై చేశారట. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు ప్రభాస్. వీళ్ళ పై ఎక్కడ ప్రేమ దోమ అన్న వార్తలే రాలేదు.