`ఆదిపురుష్` టికెట్స్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన నిర్మాత‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రం జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

సినిమా బిజినెస్ కూడా క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్ లో జ‌రుగుతోంది. మ‌రోవైపు మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. ఇలాంటి త‌రుణంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ బంప‌ర్ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించారు. `ఆదిపురుష్` టికెట్స్ ఫ్రీగా ఇస్తాన‌ని అనౌన్స్ చేశారు. అయితే ఈ ఉచిత టికెట్స్ అంద‌రికీ కాదండోయ్‌.

కార్తికేయ 2 మూవీతో గ‌త ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకుని వరుసగా పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్.. శ్రీరాముడిపై భక్తితో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వృద్దాశ్రమాలకు, ప్రభుత్వ పాఠశాలలకు మరియు అనాధ శరణాలయాలకు ఏకంగా 10 వేల టికెట్స్ తన తరుపున ఉచితంగా అందించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ఉచిత టికెట్స్ కోసం గూగుల్ ఫార్మ్స్ ని నింపి 9505034567 కి కాంటాక్ట్ చేయాలి. లేదంటే [email protected] మెయిల్ కి పంపించండి అంటూ అభిషేక్ అగర్వాల్ అనౌన్స్ చేశారు. ఈయ‌న గొప్ప నిర్ణ‌యం ప‌ట్ల నెటిజ‌న్లు ప్రశంస‌లు కురిపిస్తున్నారు.