అతి చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న ప్ర‌భాస్‌.. అక్షరాలా రూ. 276 కోట్లు గోవింద‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఖాతాలో అతి చెత్త రికార్డు న‌మోదు అయింది. ప్ర‌భాస్ గ‌త మూడు చిత్రాల కార‌ణంగా అక్షరాలా రూ. 276 కోట్లు న‌ష్టాలు వాటిల్లాయి. బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ హిట్ ముఖ‌మే చూడ‌లేదు. ఈ మూవీ అనంత‌రం ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన సినిమా `సాహో`. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రూ. 290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అయితే తొలి ఆట నుంచే సాహో నెగ‌టివ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది.

కానీ, ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సాహో రూ. 230 కోట్ల రేంజ్ లో క‌లెక్ష‌న్స్ ను రాబట్టింది. దాంతో ఈ మూవీకి రూ. 60 కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఈ మూవీ అనంత‌రం `రాధేశ్యామ్` తో ప్ర‌భాస్ ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా రిజ‌ల్ట్ ఏంటో తెలిసిందే. రూ. 210 కోట్ల టార్గెట్ తో వ‌స్తే.. ఫుల్ రన్ లో కేవలం రూ. 84 కోట్ల‌తో స‌రిపెట్టుకుంది. ఫ‌లితంగా రూ. 126 కోట్ల రూపాయిలు నష్టం వ‌చ్చింది.

ఇక రీసెంట్ గా ప్ర‌భాస్ నుంచి ఆదిపురుష్ మూవీ వ‌చ్చింది. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. రూ. 240 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఆదిపురుష్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 150 కోట్లు రాబ‌ట్టింది. ఇంకా రూ. 90 కోట్లు వ‌స్తే గానీ ఈ సినిమా లాభాల బాట ప‌ట్ట‌దు. కానీ, ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను అందుకోవ‌డం ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అసాధ్యం. మొత్తంగా ప్ర‌భాస్ గ‌త మూడు చిత్ర‌ల వ‌ల్ల ఏకంగా రూ. 276 కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఇదీ ఒక రికార్డ్ అనే చెప్పాలి. టాలీవుడ్ లో మ‌రే హీరోకు గ‌త మూడు సినిమాల న‌ష్టం క‌లిపినా ఈ రేంజ్ ఫిగ‌ర్ రాదు.