ల‌వ్ లో ఆ రెండు అస్స‌లు న‌చ్చ‌వంటున్న ర‌కుల్‌.. జాకీ భ‌య్యా జ‌ర జాగ్ర‌త్త మ‌రి!!

టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్ కు మకాం మార్చిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. అక్కడ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ రకుల్ కు ఇంతవరకు ఒక్కసారైనా హీట్ కూడా పడలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రకుల్ బాలీవుడ్ యాక్టర్ మ‌రియు ప్రొడ్యూస‌ర్‌ జాకీ భగ్నానీ తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ర‌కుల్ స్వ‌యంగా జాకీతో త‌న బంధం కూడా బ‌య‌ట పెట్టింది. షూటింగ్స్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా.. ర‌కుల్ జాకీతోనే టైమ్ స్పెండ్ చేస్తుంటుంది. అలాగే సినిమా ఫంక్ష‌న్స్‌, అవార్డ్ ఈవెంట్స్ లోనూ వీరిద్ద‌రూ క‌లిసే పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేక‌పోయినా.. వీరిద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుస్తున్నారు.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌కుల్‌.. ప్రేమ గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `ప్రేమకు అతి పెద్ద శత్రువులు.. అబద్దం, మోసం. ల‌వ్ లో ఈ రెండు నాకు అస్స‌లు న‌చ్చ‌వు. ఎవ‌రైనా ఇద్ద‌రు ల‌వ్ లో ఉంటే.. అన్నీ ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఏదేఐనా త‌ప్పు చేస్తే దాచ‌కుండా చెప్పాలి. ఈ రోజుల్లో ప్రేమను తప్పుగా వాడుకుంటున్నా.రు ఏదేదో ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమించే వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వకుండా తనకు నచ్చిందే చేయాలని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లది అసలు ప్రేమే కాదు. ఒక‌రి ఇష్టాల‌ను ఒక‌రు గౌర‌వించుకోవాలి. ఒక‌రికొక‌రు స‌పోర్ట్ చేసుకోవాలి. అదే నిజ‌మైన ప్రేమ‌` అంటూ ర‌కుల్ చెప్పుకొచ్చింది. దీంతో ర‌కుల్ కామెంట్స్ పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. క‌రెక్ట్ గా చెప్పార‌ని కొంద‌రు అంటుంటూ.. మ‌రికొంద‌రు జాకీ భ‌య్యా జ‌ర జాగ్ర‌త్త పొర‌పాటున ర‌కుల్ కు అబద్దం చెప్పినా మోసం చేసినా నీతో బ్రేక‌ప్పే అంటూ స‌ర‌దాగా కామెంట్లు ప‌డుతున్నారు.