బిగ్ షాకింగ్: పోలీస్ స్టేషన్ లో రజినీకాంత్ కూతురు సౌందర్య.. అసలు ఏం జరిగిందంటే..?

కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత 17 ఏళ్లు కాపురం చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు ఆకతాయిలు .

కాగా ఆ తర్వాత అలాంటి ట్రోలింగ్స్ ను తట్టుకొని లైఫ్ లో ముందుకు దూసుకెళ్తున్న ఐశ్వర్య ఇంట రీసెంట్ గా నే దొంగతనం జరిగింది. ఇంట్లో బంగారు ఆభరణాలు వజ్రాల దొంగలించినందుకు ఇంటి పనిమనిషిని డ్రైవర్ని తానంపేట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా రీసెంట్గా మరోసారి సినీ నటుడు రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య పేరు కూడా అలానే సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది .

తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది అన్న న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ కారు కీ స్ మిస్ అయ్యాయని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లింది సౌందర్య అంటూ తెలుస్తుంది. చెన్నైలోని తేనేపేట పోలీస్ స్టేషన్లో ఆమె ఈ కంప్లైంట్ ను ఫైల్ చేసిందట. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది . తన రేంజ్ రోవర్ కారు తాళం చెవి పోగొట్టుకున్నట్లు అందుకోసమే ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కినట్లు తెలుస్తుంది . దీంతో అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు..!!