“ఆ రాత్రి ఎప్పటికి మర్చిపోను”..స్పెషల్ మూమెంట్ ను అభిమానులతో షేర్ చేసుకున్న అలియా..పిక్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి మాటలు మాట్లాడిన సరే ..ఒకటికి నాలుగు అర్థాలు తీస్తూ హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు సదరు స్టార్ సెలబ్రెటీస్ ని ..ఈ క్రమంలోనే రీసెంట్గా అలాంటి కామెంట్స్ చేసిన అలియా భట్ మరోసారి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . బాలీవుడ్ బడా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అలియాభట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్టేటస్ క్రియేట్ చేసుకొని టాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ట్రై చేస్తూ రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .

అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆలియా రీసెంట్ గానే ఓ పాపకు జన్మనిచ్చింది. ఓ పక్క బేబీ తో మరో పక్క సినిమాలతో టూ బిజీ బిజీగా గడుపుతున్న అలియా భట్ రీసెంట్గా మెట్ గాలా 2033 ఈవెంట్లో పాల్గొంది . ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్గా జరిగిన ఈ సెలబ్రేషన్స్లో అలియా కూడా భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది .

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ..”మన ఇండియన్ సాంప్రదాయాన్ని అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాను. అందుకే లక్ష ముత్యాలు క్రియేట్ చేసిన ఈ డ్రెస్ ని వేసుకున్నాను ..అఫ్కోర్స్ నడిచేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది ..కాళ్లు గజగజ వణికిపోయాయి. అయినా సరే ఎక్కడ నేను తడబడలేదు . ఆ రాత్రి నా లైఫ్ లో మర్చిపోలేనిది ..ఆ ఈవెంట్ లో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నాను “అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే అలియా మాటలను సోషల్ మీడియాలో వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

 

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)