ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకి గట్టి పోటీ చేస్తున్నాడు. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో తన సినిమాలో నటించారు. శ్రీదేవి నుంచి మొదలుకొని నేటితరం హీరోయిన్లైన కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి వారితో కూడా నటించాడు.
ఇక ఈ విషయం పక్కన పెడితే చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఇంద్ర సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు చిరంజీవి కోసం గొడవ పడ్డారట. యాక్షన్ సినిమాల దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఇంద్ర సినిమా చిరు కెరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.
అలాంటి ఆ సూపర్ హిట్ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో చివరికి ఎవరు చిరంజీవికి భార్యగా నటించాలి అనే సమయంలో ఇద్దరు హీరోయిన్లు షూటింగ్ సెట్లో గొడవపడ్డారట. ఈ ఇద్దరు హీరోయిన్ల గొడవ చూసి దర్శకుడు బి గోపాల్, చిరంజీవి భార్యగా ఎవరిని చూపించాలో అర్థం కాక చివరికి ఎవరిని భార్యగా చూపించకుండా ఆ సినిమాను ముగించారు. ఇలా ఈ సినిమా షూటింగ్లో ఇద్దరు ముద్దుగుమ్మలు ఫన్నీగా గొడవపడ్డారట.