చుక్క‌ల్లో మృణాల్ రెమ్యున‌రేష‌న్‌.. స‌మంత‌, న‌య‌న‌తార‌నే మించిపోయింది!

సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ముద్దుగుమ్మ‌ల్లో న‌య‌న‌తార‌, స‌మంత ముందు వరుస‌లో ఉన్నారు. వీరిద్ద‌రూ ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 5 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే వీరిద్ద‌రినీ పారితోషికం విష‌యంలో నిన్న‌గాక మొన్న వ‌చ్చిన మృణాల్ ఠాకూర్ మించిపోయింది.

సీరియ‌ల్స్ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అర డ‌జ‌న్ కు పైగా చిత్రాల్లో న‌టించింది. స్టార్ హోదా ద‌క్క‌క‌పోయినా.. న‌టిగా తానేంటో నిరూపించుకుంది. అయితే గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో మృణాల్ జాత‌క‌మే మారిపోయింది. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి రూపొందించిన ఈ మూవీ సౌత్ తో పాటు నార్త్ లోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ సినిమాతో మృణాల్ ఓవ‌ర్ నైట్ స్టార్ గా అవ‌త‌రించింది. అలాగే సీతారామం త‌ర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. పైగా భారీ రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తోంది. ఈ అమ్మ‌డు ఒక్కో సినిమాకు రూ. 6 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటుంద‌ని అంటున్నారు. `నాని 30`లో ఈమె హీరోయిన్‌గా ఎంపిక అయింది. ఈ సినిమాకు కూడా ఆమె అదే స్థాయిలో పారితోషికం అందుకుంటుంద‌ట‌. ఏదేమైనా ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కే మృణాల్ రెమ్యున‌రేష‌న్ చుక్క‌ల్లో చేరుకోవ‌డంతో నిర్మాత‌లు కాస్త ప‌రేష‌న్ అవుతున్నార‌ని టాక్‌.