అందాల రాశి దివ్యభారతి మరణించి ముప్పై ఏళ్లు గడుస్తోంది. ఈరోజు ఆమె వర్ధంతి అవడంతో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పట్లో దివ్యభారతి ట్రెండింగ్ హీరోయిన్. కేవలం పంతొమిదేళ్ల వయసులోనే తన అందం నటనతో బాలీవుడ్ను షేక్ చేసింది. దిల్ కా క్యా కసూర్, దివానా, రంగ్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.
అంతే కాకుండా తెలుగులో బొబ్బిలిరాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, ధర్మక్షేత్రంతో సహా మరికొన్ని సినిమాల్లో నటించి టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇక చిన్న వయసులోనే స్టార్ డమ్ ను చూసిన దివ్యభారతి పంతొమిదేళ్ల వయసులోనే భవనం పై నుంచి పడి మరణించింది. దివ్య భారతి తండ్రి ఒకానొక సమయంలో తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని అన్ని కూడా తెలిపారు.
అలాగే, ఆమెది మర్డర్ కూడా కాదన్నారు. డిప్రెషన్లో మందు తాగి బాల్కనీ నుంచి దూకినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “అరగంటలో ఎంత తాగుతారు? మా అమ్మాయి డిప్రెషన్లో లేదు. బాల్కనీ అంచున కూర్చుని ఉంది. బ్యాలన్స్ తప్పి కిందకు పడిపోయింది. ప్రమాదవశాత్తూ అలా జరిగింది. ప్రతిరోజూ కింద కార్లు ఉండేవి. ఆ రోజు ఒక్కటి కూడా లేదు. దాంతో నేరుగా నెల మీద పడింది. అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్స్కు గ్రిల్స్ ఉన్నాయి. తన ఫ్లాట్కు తప్ప” అని దివ్య భారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి చెప్పారు.
దివ్య భారతి మరణించే సమయానికి ఆమె వయసు 19 ఏళ్ళు. పదహారు ఏళ్ళకే హీరోయిన్గా తెరంగేట్రం చేయడం, మూడేళ్ళలో 20 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మరణించే సమయానికి దివ్య భారతి చేతిలో పది సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు మధ్యలో ఆగిపోతే… మిగతా సినిమాల్లో శ్రీదేవి, రవీనా టాండన్, కాజోల్, జుహీ చావ్లా వంటి హీరియిన్లతో వాటిని పూర్తి చేశారు.