“ఆమెను చంపేద్దాం”..అక్కినేని అభిమానులను బాధపెడుతున్న సమంత పోస్ట్.. మధ్యలో ఈ గోల ఏంట్రా బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఏ పోస్ట్ చేసిన సరే క్షణాలలోని వైరల్ గా మారిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత చేసిన ప్రతి పోస్ట్ ని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు రీసెంట్గా సమంత తన తాను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా నాలుగేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాకి సంబంధించిన పిక్ ని షేర్ చేసుకుంది . ఈ క్రమంలోనే సమంత చేసిన పోస్ట్ మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతుంది.

మల్టీ టాలెంటెడ్ శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత – నాగచైతన్య కలిసి నటించిన సినిమా మజిలీ . 5 ఏప్రిల్ 2019లో ఈ సినిమా రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . మరీ ముఖ్యంగా అప్పటివరకు నాగచైతన్య – సమంత పై ఉన్న నెగిటివ్ రిమార్క్స్ అన్నిటిని ఈ సినిమా పాజిటివ్ గా మార్చేసింది . అంతేకాదు ఈ సినిమాతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జంట ..అభిమానుల్లో క్రేజ్ కూడా సంపాదించుకుంది.

కాగా ఈ సినిమా నేటికీ రిలీజ్ అయి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది . ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ శివ నిర్వాణ ని ట్యాగ్ చేస్తూ నోట్ షేర్ చేసింది . “శ్రావణి లాంటి మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు థాంక్స్ ..ఇప్పుడు ఆ పాత్రను చంపేసి ఖుషి సినిమాలోని ఆరాధ్య పాత్రను హైలెట్ చేద్దాం” అనే విధంగా పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు . అక్కినేని ఫ్యాన్స్ కి శ్రావణి ఎంతో పర్సనల్ గా కనెక్ట్ అయిందో మనకు తెలుసు. ఈ క్రమంలోనే సమంత ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇప్పుడు అక్కినేని అభిమానులకు తీవ్రంగా హర్ట్ చేసినట్లయింది. అంతే కాదు ఈ పోస్ట్ కి హీరో అక్కినేని నాగచైతన్యను ట్యాగ్ చేయకపోవడం కూడా ఫాన్స్ ను తీవ్రంగా హార్ట్ చేస్తుంది . అఫ్ కోర్స్ విడాకులు తీసుకున్నా సరే సినిమాల్లో కోస్టార్ గా వర్క్ చేశాడుకదా. విడాకులు తీసుకున్న టైంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటామన్నారు మరి ఆ మాటలు ఏమైపోయాయి అంటూ ఫ్యాన్స్ ఓపెన్ గా ప్రశ్నిస్తున్నారు..!!