`విరూపాక్ష‌` దెబ్బ‌కు అమాంతం రెమ్యున‌రేష‌న్ పెంచేసిన తేజ్‌.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సక్సెస్ ఫుల్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు.

ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష బ్లాక్ పాస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టి దుమ్ము దులిపేసింది. అయితే విరూపాక్ష భారీ విజయం సాధించడంతో సాయి ధర‌మ్ తేజ్‌ తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశాడని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.

విరూపాక్షకు ముందు వరకు ఒక్కో సినిమా రూ. 8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న తేజ్‌.. ఇకపై త‌న కొత్త ప్రాజెక్ట్ ల‌కు ఏకంగా రూ. 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. విరూపాక్ష మూవీతో తేజ్ మార్కెట్ భారీగా పెరిగింది. దీంతో నిర్మాతలు సౌతం తేజ్ అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేద‌ని తెలుస్తోంది.