త‌ల్లి చ‌నిపోయి రెండు రోజులు కాలేదు.. మ‌మ్ముట్టి ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు!

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి త‌ల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) శుక్ర‌వారం నాడు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా.. కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

అయితే త‌ల్లి చ‌నిపోయి రెండు రోజులు కాలేదు.. మ‌మ్ముట్టి ఎలాంటి ప‌ని చేశాడో తెలిస్తే షాకైపోతారు. ఈయ‌న అఖిల్ అక్కినేని హీరోగా తెర‌కెక్కిన `ఏజెంట్‌`లో కీల‌క పాత్ర‌ను పోషించాడు. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మార్చి 28న విడుద‌ల కాబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి మ‌మ్ముట్టి డ‌బ్బింగ్ వ‌ర్క్ పెండింగ్ లో ఉంద‌ట‌.

అయితే ఏజెంట్ మూవీ డ‌బ్బింగ్‌ను ఆయ‌న ఆదివారం పూర్తిచేసిన‌ట్లు తెలిసింది. త‌ల్లి చ‌నిపోయిన బాధ‌లోనూ త‌న క‌ర్త‌వ్యాన్ని మ‌రువ‌లేదు మ‌మ్ముట్టి. పుట్టెడు దుఃఖంలోనూ ఏజెంట్ డ‌బ్బింగ్‌ను మ‌మ్ముట్టి కంప్లీట్ చేశారు. దీంతో ఆయ‌న డెడికేష‌న్ కు అంత ఫిదా అవుతున్నారు. ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాగార్జున సైతం ఈ విష‌యాన్ని చ‌ర్చిస్తూ మ‌మ్ముట్టిపై ప్ర‌శంస‌లు కురిపించారు.