`విరూపాక్ష`.. బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటిల్ లాక్ లభించింది.
టాక్ అనుకూలంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతుంది. అయితే విరూపాక్ష హిట్ తో తేజ్ డబుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే, ఈ సినిమాతో హీరోగానే కాదు నిర్మాతగా కూడా తేజ్ సక్సెస్ అయ్యాడు. ఇటీవల కాలంలో హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు. అయితే విరూపాక్ష కథ వినగానే తేజ్ కు బాగా నచ్చేసిందట. ఈ మూవీలో హీరోగానే కాకుండా నిర్మాతగా వ్యవహరించాలని భావించాడట.
అలా డైరెక్టర్ సకుమార్ అండ్ ఎస్ వీ సీసీ కొల్లాబిరేషన్లో.. ఈ సినిమా నిర్మించేందుకు తేజ్ అడుగులు వేశాడు. ఇక ఈ ముగ్గురి ప్రొడక్షన్స్లో అలా మొదలైన విరూపాక్ష తాజాగా సూపర్ డూపర్ హిట్టైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం రేపుతోంది. దానికి తోడు థియేటర్స్, నాన్ థియేటర్స్ వసూళ్లతోనే రిలీజ్ కు ముందే లాభాల బాట పట్టేసింది. దీంతో నిర్మాతగా మారిన తొలి సినిమాతోనే తేజ్ సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే లక్ అంటే తేజ్ దే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.