పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆయన చేతిలో ప్రస్తుతం ఐదురు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు అన్నిటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. అవన్నీ కూడా భారీ ప్రాజెక్టు
సినిమాలు కావడంతో ఆయన అభిమానులు ప్రతి సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.
ప్రభాస్ లైన్ అప్ లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ఆదిపురుష్.. తొలిసారిగా ప్రభాస్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమా కూడా ఇదే.. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.కాగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా కనిపించబోతున్నాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నాడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్. ఇందులో బాగంగానే ట్రైలర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేటంటే.. మేకర్స్ ఈ ట్రైలర్ కట్ ని సుమారు 3 నిమిషాల 22 సెకంన్లు ఉండేలా సెట్ చేశారట. ఈ ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లో, విజువల్ ట్రీట్ గా ఉండమబోతుందట. టీజర్ విషయంలో జరిగిన మిస్టేక్స్ మల్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారట మేకర్స్. మరి ఈ ట్రైలర్ ని కూడా థియేటర్స్ లో.. మెయిన్ గా 3డి వెర్షన్ లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.