టాలీవుడ్ లో ఎవరు ఊహించని మరో మల్టీస్టారర్ తెరకెక్కబోతుంది. ఇప్పటికే తెలుగులో మల్టీస్టారర్ సినిమాలో ట్రెండ్ మొదలైంది. ఈ సంక్రాంతికి చిరంజీవి- రవితేజ కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో రవితేజ మరో భారీ మల్టీస్టారర్ను సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నాడు. ఈసారి యంగ్ హీరోశర్వానంద్ కలిసి నటించబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాగా. ఈ సినిమాను యువ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ- శర్వానంద్ గురు శిష్యులుగా నటించబోతున్నారట. ఓ లెక్చలర్కీ, ఓ స్టూడెంట్ కీ మధ్య జరిగే కథ ఇది. వాళ్ల మధ్య ఉండే రిలేషన్, ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్ ఈ కథకు మూలం. ఇప్పటికే రవితేజకు ఫుల్ స్క్రిప్ట్ నేరేట్ చేశాడట సందీప్రాజ్. శర్వా కూడా దాదాపుగా ఓకే చెప్పేసినట్టే. ఒకవేళ శర్వానంద్ `నో` అంటే సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది.
ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. తొలుత రెండు మూడు నిర్మాణ సంస్థలు ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపించాయట. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా, భారీ ఎత్తున ఖర్చుకు రాజీ పడకుండా నిర్మించేలా జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. త్వరలో సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.