మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
హర్రర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రేపు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. తన లైఫ్ లో జరిగిన బ్రేకప్స్, క్రష్, పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు. అలాగే ఓ హీరోయిన్ ను డైరెక్ట్గా డేట్ కి పిలిచానంటూ సీక్రెట్ ను రివీల్ చేశారు.
ఇంతకీ తేజ్ డేట్ కి పిలిచింది మరెవరినో కాదు లారిస్సా బోనేసి. `తిక్క` సినిమాలో తేజ్, లారిస్సా బోనేసి జంటగా నటించారు. అయితే తొలి చూపులోనే ఆమెతో తేజ్ లో ప్రేమలో పడ్డాడట. ఆలస్యం చేయకుండా.. లారిస్సా వద్దకు వెళ్లి `నువ్వంటే నాకు ఇష్టం.. ఒకే అంటే డేటింగ్ చేద్దాం` అని అడిగేశాడట. అందుకు లారిస్సా `సారి తేజ్.. నాకు ఆల్రెడీ బాయ్ఫ్రెండు ఉన్నాడు` అని చెప్పి షాకిచ్చిందట. దాంతో తన హార్ట్ బ్రేక్ అయిందంటూ తేజ్ స్వయంగా పేర్కొన్నాడు.