ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ కాంబినేషన్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమా గురించి ప్రేక్షకులు మాములుగా ఎదురుచూడడం లేదు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకులకు అంత క్రేజ్ ఉంటుంది. అందులోనూ రాజమౌళి తో మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగే పండగా.
ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మహేష్ తో రాజమౌళి ఎలాంటి ? సినిమా చేస్తాడో అన్న ఆసక్తి ప్రేక్షకులో నెలకొంది. ఇదిలా ఉంటే రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు రాజమౌళి .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో వండర్కు రెడీ అవుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్స్ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. మొదట బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వినపడింది. ఆ తర్వాత హాలీవుడ్ హీరోయిన్ జెన్న ఓర్టే నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా జాన్వీ కపూర్ నీ జక్కన్న కన్ఫామ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. పైగా హీరోయిన్ శ్రీదేవికి తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే జాన్వీకపూర్ తెలుగు ఎన్టీఆర్-కొరటాల సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. అంతే కాకుండా రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చే సినిమాలో కూడా జాన్వీ నటించబోతుంది. ఇక ఇప్పుడు మహేష్ రాజామౌళి సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా రాజిమౌళి ఎన్టీఆర్30 సినిమా పూజ కార్యక్రమంలో జాన్వీతో ప్రత్యేకంగా మట్లాడం అంతే కాకుండా ఆమెతో ఓ అగ్రిమెంట్ మీద కూడా సంతకం తీసుకున్నాడు. ఇక దీంతో ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా కన్మమ్ అయినట్టు తెలుస్తుంది. ఈసారి రాజామౌళి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియెట్ చేస్తాడో చూడాలి.