RRR హిట్ అవ్వడానికి .. శాకుంతలం దొబ్బేయడానికి కారణం అదేనా..? నటి మధుబాల కాంట్రవర్షీయల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత లేటెస్ట్ గా నటించిన సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ ని నమోదు చేసుకుంది . ఈ సినిమా కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు మేకర్స్. దాదాపు 80 నుంచి 100 కోట్లు ఖర్చు చేసి మరి ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించిన నష్టాలు ఎదురయ్యాయి .

దీనికి మెయిన్ రీజన్ సినిమా జనాలకు అంతగా నచ్చలేదు . ఈ క్రమంలోని సినిమాలో అప్సరస మేనక పాత్రలో నటించిన మధుబాల షాకింగ్ కామెంట్స్ చేసింది . “శాకుంతలం సినిమా జనాలకు ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కావడం లేదు . ఆర్ ఆర్ ఆర్ , బాహుబలి కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. పురాణాలకి సంబంధించింది ఈ సినిమా. ఈ జనరేషన్ పిల్లలకి శాకుంతలం సినిమా ఎంతో ఇంపార్టెంట్ . అయినా సరే ఎందుకు ఈ సినిమాను యాక్సెప్ట్ చేయలేకపోయారు జనాలు అర్థం కావడం లేదు”.

ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పట్టుదలతో కృషితో వర్క్ చేశారు. ఇష్టాం గా వర్క్ చేశారు తప్పిస్తే కష్టంగా ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు. ఈ సినిమా సరిగ్గా ఆడలేదు అని తెలిసి నేను చాలా ఫీల్ అయ్యాను .. అయినా శాకుంతలం సినిమా ఎందుకు ఫ్లాప్ చేశారో అర్థం కావడం లేదు” అంటూ బోల్డ్ గా స్పందించింది .

అంతేకాదు మధుబాల కామెంట్స్ పై కొందరు సమంత హేటర్స్ స్పందించారు . ఆర్ ఆర్ఆర్ సినిమాతో శాకుంతలం సినిమాని కంపేర్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . ఆర్ఆర్ఆర్ ఓ రేంజ్ లో ఇండస్ట్రి రికార్డులను తిరగరాస్తే.. శాకుంతలం సినిమా ద్వార సమంత తన తలరాతను తానే తిరగరాసుకుంది అంటూ సమంతను ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మధుబాల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయుతున్నాయి..!!