విడాకులు తీసుకున్న ఇన్ని నెలలకు ..ఆ పని చేయబోతున్న ధనుష్ ..”సార్” కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన చాలా సింప్లిసిటీగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు . మనకు తెలిసిందే ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ అనే చెప్పే స్థాయి నుంచి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అనే చెప్పే స్థాయికి ఎదిగిపోయాడు హీరో ధనుష్ . రీసెంట్ గా ఆయన నటించిన సార్ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిందో మనందరికీ తెలిసిందే .

తెలుగు హీరోలు కూడా కొల్లకొట్టని రికార్డులను కోలీవుడ్ హీరో తెలుగు ఇండస్ట్రీలో క్రియేట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నాడు అన్న విషయం మనందరికీ తెలుసు. కారణాలు ఏంటో తెలియదు కానీ ..ఎవరు ఊహించని విధంగా తన భార్యకు విడాకులు ఇస్తున్నాను అంటూ ప్రకటించడం .. ఆ తర్వాత ఈ జంట దూరం అయిపోవడం జనాలకు బాధగా అనిపించింది .

అయితే అప్పట్లో వీళ్ళకి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ధనుష్ స్టార్ హీరోయిన్ మోజులో ఐశ్వర్య కు విడాకులు ఇచ్చారు అంటూ కోలీవుడ్లో రజనీకాంత్ ఫాన్స్ ఆయన పై దుమ్మెత్తి పోశారు.. నానా రకాలుగా ట్రోల్ చేశారు . కాగా ప్రెసెంట్ కూడా అదే విధంగా ధనుష్ పై ఉన్నవి లేనివి క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధనుష్ సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడానికి ఫిక్స్ అయ్యాడట . తనపై ఇలా నెగిటివ్గా రాసి నెగటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లకి తన కెరీర్ ని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్న వాళ్లకి శిక్ష పడే విధంగా లీగల్ లింకులను వెతుక్కుంటున్నాడట . దీంతో కొందరు విడాకులు తీసుకున్నప్పుడు జరిగిన ట్రోలింగ్కి ఇప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుంటున్నావా..? ఇప్పుడు నీకు బల్బ్ వెలిగిందా..? అంటూ వ్యంగంగా స్పందిస్తున్నారు .