బన్నీ, మహేష్‌లపై మోజు పడుతున్న స్టార్ హీరోయిన్.. ఒక్కసారి ఛాన్స్ వస్తే!

సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ గని, మేజర్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే ఈ తార రెండు సినిమాలతోనే తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది. ఈ బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన గని సినిమాతో టాలీవుడ్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది, అయినా ఆమె లుక్, నటన అందరికీ తెగ నచ్చేసింది. ఆపై అడివి శేష్ హీరోగా నటించిన మేజర్‌ సినిమాలో ఈ అందాల తార మెరిసింది. ఈ మూవీలో సాయి లుక్స్ అందరి హృదయాలను దోచేశాయి. దీనితో తొలి తెలుగు హిట్ కూడా ఆమె తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రామ్‌తో ఈ ముద్దుగుమ్మ జత కట్టింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఒక మూవీలో ఈ తార రామ్ తో రొమాన్స్ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ అందాల బొమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తదుపరి మూవీ షూటింగ్‌ను హైదరాబాద్‌లో వేగంగా జరుపుతున్నట్లు తెలిపింది. రామ్ తనకు కొన్ని సన్నివేశాల్లో హెల్ప్ చేశాడని.. ఇక బోయపాటి శ్రీను ప్రతి నిమిషానికి సంబంధించిన వివరాలను చాలా చక్కగా వివరించాడని, ఆయనతో కలిసి పనిచేయడం చాలా గొప్ప అనుభూతిని అందించిందని ఆమె చెప్పుకొచ్చింది.

హైదరాబాద్‌పై తనకున్న ప్రేమ గురించి మాట్లాడుతూ.. తనకు చిన్నతనంలోనే హైదరాబాద్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపింది. ఒకసారి స్కూల్ ట్రిప్‌లో భాగంగా భాగ్యనగరానికి వచ్చినట్లు తెలిపింది. దబాంగ్ 3 ప్రమోషన్ల కోసం హైదరాబాద్ కి వచ్చినప్పుడు టాలీవుడ్ దర్శకుడు తనను సంప్రదించడం ప్రారంభించారని వెల్లడించింది. ఇక హైదరాబాదులో తనకి ఇష్టమైన రెండు వంటకాలు ఏవో కూడా తెలిపింది.

“నాకు చాలా ఇష్టమైనది టమాటా పప్పు. అలానే గోంగూర పచ్చడి. నేను రంజాన్ సమయంలో ఆహారాన్ని కూడా బాగా ఇష్టపడతాను, ముఖ్యంగా ఓల్డ్ సిటీ కబాబ్‌లు, మాల్పువా!” అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్ లో ఏ హీరోతో కలిసి నటించాలని ఉందో చెప్పాలని అడగ్గా.. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘టాలీవుడ్ స్టార్స్ అందరితో కలిసి పనిచేయడానికి నేను ఇష్టపడతాను’ అని సాయి చెప్పింది. ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు అని వారిపై తన మోజును పెట్టపరిచింది. మహేష్ బాబు సరసన అవకాశం వస్తే వదులుకోనని చెప్పి ఆశ్చర్యపరిచింది.