ప్రభాస్-అనుష్క.. ఈ జోడికి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, రెబల్, బాహుబలి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే వెండితెరపై అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ అద్భుతంగా అలరించింది. ఎంతలా అంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని పుకార్లు పుట్టేంత.
గతంలో ఎన్నోసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వారు మాత్రం తాము స్నేహితులం అంటూ చెబుతూనే వచ్చారు. 40 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి ఊసు ఎత్తకుండా కెరీర్ను కొనసాగిస్తున్నారు. పెళ్లి విషయం ఏమో కానీ వీరిద్దరూ మరోసారి జంటగా తెరపై కనిపిస్తే చూడాలని అభిమానులు, సామాన్య ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నానేజ అయితే ఇప్పుడు అందరూ కోరుకున్నదే జరగబోతోంది. దాదాపు ఏదేళ్ల తర్వాత ప్రభాస్ అనుష్క కాంబో సెట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరి కలయికలో ప్రముఖ దర్శకుడు క్రిస్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం కృష్ పవన్ కళ్యాణ్ తో `హరిహర వీరమల్లు` అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీ పట్టాలెక్కి మూడేళ్లు అవుతున్న ఇంకా ముగింపు దశకు రాలేదు. పవన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రీ టైమ్లో లో ప్రభాస్ అనుష్కల కోసం ఒక కథను సిద్ధం చేశాడట. ఆ కథ ప్రభాస్ అనుష్కలకు వినిపించగా.. వారి సైతం ఎంతో బాగా నచ్చిందట. ప్రస్తుతం క్రిష్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం అవుతుంది.