“అంత దగా, మోసం, అబద్ధం నమ్మొద్దు.. అసలు సాయి ధరమ్ తేజ్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు” .. సంచలన విషయాని బయటపెట్టిన అబ్దుల్..!!

మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా హీరోగా నటించిన సినిమా విరూపాక్ష . సుకుమార్ ఈ సినిమాకి కథను అందించగా.. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . మరీ ముఖ్యంగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హిట్గా నిలవడం నిజంగా గ్రేట్ అంటున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే సాయిధరమ్ తేజ్ కు పునర్జన్మను అందించిన అబ్దుల్ పేరు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే 2021లో సాయిధరమ్ తేజ్ మేజర్ బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారు, చావు తో పోరాడి దాదాపు రెండు నెలల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే గమనించిన అబ్దుల్ హుటాహుటిన స్పందించి హాస్పిటల్ లో అడ్మిట్ చేయించాడు . ఇదే విషయాన్ని విరుపాక్ష సినిమా ప్రమోషన్స్ లో కూడా చెప్పుకొచ్చాడు. “సాయిధరమ్ తేజ్ అతడికి థాంక్స్ చెప్పి డబ్బులు ఇస్తే సరిపోదని ..నాకు పునర్జన్మను అందించాడని.. అతని రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు . అంతేకాదు అతగాడికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఎటువంటి హెల్ప్ కావాలి అన్న ఫోన్ చేయమన్నాను అంటూ కూడా చెప్పకు వచ్చాడు. సీన్ కట్ చేస్తే రీసెంట్ గా కొన్ని మీడియా ఛానల్స్ అబ్దుల్ ని ప్రశ్నించగా అలాంటిది ఏదీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు .

సాయిధరమ్ తేజ్ కానీ మెగా ఫ్యామిలీ కానీ ఎవరు తనను కలవలేదు అని ..ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అని .. ఎటువంటి హెల్ప్ చేయలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇదివరకు సీఎంఆర్ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నాను అని ..కానీ ఎప్పుడైతే సాయిధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయి నేను కాపాడానో అప్పట్నుంచి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు వైరల్ అయి ..మెగా ఫ్యామిలీ నాకు లక్షల డబ్బు ఇచ్చారు అంటూ ప్రచారం చేస్తున్నారని ..ఆ క్రమంలోనే కొందరు నన్ను ఏడిపిస్తూ ఇక నీ దగ్గర డబ్బు ఉంది ఈ జాబ్ చేయాల్సిన అవసరం లేదు అంటూ టార్చర్ చేశారని .. ఆ బాధలు భరించలేక జాబ్ కూడా మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు .

అంతే కాదు ఇప్పటికీ మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదు అంటూ కూడా అబ్దుల్ వివరణ ఇచ్చాడు . ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ సినిమా ప్రమోషన్స్ కోసమే అలా మాట్లాడాడా..?? అంటూ కూడా జనాలు షాక్ అవుతున్నారు. అంతేకాదు ప్రెసెంట్ అబ్దుల్ పరిస్థితి మరి దయనీయంగా ఉందని ..జాబ్ లేక పూట గడవడానికి కూడా కష్టంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు .