మెగా మామ అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ నటుడు సముద్రఖని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. జులై 28న థియేటర్స్ లో ఈ మెగా మల్టీస్టారర్ దిగబోతోందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో మామ అల్లుళ్లు యమా ఫస్ట్ గా ఉన్నారే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఈ సినిమా కథ విషాయినికి వస్తే.. ఓ యువకుడు కారు యాక్సిడెంట్ లో మరణిస్తే దేవుడు అతనికి మళ్లీ బ్రతికేందుకు రెండో అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్నదే మెయిన్ స్టోరీ. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యాక్సిడెంట్ లో మరణించే వ్యక్తిగా తేజ్, దేవుడిగా పవన్ కనిపించబోతున్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1639207796267974657?s=20